మక్తల్: మక్తల్ మండల కేంద్రంలో బుధవారం నారాయణపేట జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ విజయ్ కుమార్ పలు మీ సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన నూతన ఆహార భద్రత కార్డు దరఖాస్తు సేవ గురించి మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు తగిన సూచనలు అందించారు. అదేవిధంగా, మీ సేవ నిర్వాహకులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రజలు నిర్ణీత రుసుము మాత్రమే చెల్లించి, ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో ప్రజాపాలన లేదా గ్రామసభ ద్వారా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, లేదా మీ సేవా పోర్టల్లో దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, మళ్లీ దరఖాస్తు చేయాలనే నిర్ణయం పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో TSTS డిఎం రామ్ మోహన్, మీ సేవ నిర్వాహకులు అనిల్, సురేష్, నజీయా బేగం, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.